అడ్డుకున్న రైతులు… వెనుతిరిగిన అధికారులు

by  |
అడ్డుకున్న రైతులు… వెనుతిరిగిన అధికారులు
X

దిశ, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా యాచారం మండల మేడిపల్లి గ్రామంలో ఫార్మసిటీ రోడ్డు సర్వే చేయడం కోసం వచ్చిన అధికారులను గురువారం రైతులు అడ్డుకున్నారు. భూములు ఇవ్వమని రైతులు ఎన్నిసార్లు తెగేసి చెప్పినా… పొలాల్లోకి వచ్చి అధికారులు సర్వేలు చేస్తున్నారని, రైతులు ఆగ్రహానికి గురయ్యారు. రైతులు ఒక్కసారిగా గుంపుగా వచ్చి అడ్డగించడంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.


Next Story

Most Viewed