విషాదం.. పొలంలోనే రైతు బలి

by  |
విషాదం.. పొలంలోనే రైతు బలి
X

దిశ, పాలేరు: విద్యుత్ షాక్ కు గురై రైతు మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో తిరుమలయపాలెం మండలంలోని బచ్చోడు గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై అంగిరేకుల ఉప్పయ్య అనే రైతు మృత్యువాత పడ్డారు.

సాగు నిమిత్తం బురద గొర్రు తెచ్చే క్రమంలో విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed