సిద్దిపేట జిల్లాలో రైతు మృతి

by  |
సిద్దిపేట జిల్లాలో రైతు మృతి
X

దిశ, హుస్నాబాద్: పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం లింగాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తాడెం సాయిలు (60) వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా బోరుకు సంబంధించిన కరెంట్ వైర్లు తగలడంతో షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య సత్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.



Next Story