కరోనాతో ప్రముఖ కమెడియన్ మృతి..!

by  |
కరోనాతో ప్రముఖ కమెడియన్ మృతి..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనాతో కన్నుమూశారు. కరోనా వైరస్ సోకిన వేణుగోపాల్.. గత 23 రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ.. ఆయన కోలుకోకపోవడంతో వెంటిలేటర్‎పై చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వేణుగోపాల్ స్వస్థలం. ఎఫ్‎సీఐ మేనేజర్‎గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. కోసూరి వేణుగోపాల్ తనదైన స్టైల్లో ఓ డైలాగ్ డిక్షన్‌ ఏర్పర్చుకుని తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. మర్యాద రామన్న, పిల్లజమిందారు, చలో వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందారు. వేణుగోపాల్‎కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వేణుగోపాల్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed