సీఎస్ సోమేష్‌ కుమార్ కృషితోనే ఎక్సైజ్ పదోన్నతులు

by  |
సీఎస్ సోమేష్‌ కుమార్ కృషితోనే ఎక్సైజ్ పదోన్నతులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఆబ్కారీ శాఖలో గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పునర్‌వ్యవస్థీకరణ, పదోన్నతుల ఫైలును ప్రభుత్వం ఆమోదించినందుకు సీఎస్ సోమేష్ కుమార్‌కు తెలంగాణ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి. రవీందర్‌రావు, డి. అరుణ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. శాఖ అభ్యున్నతికి మరింతగా కృషిచేస్తామని పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం సచివాలయంలో సీఎస్ సోమేష్ కుమార్‌ను కలిశారు. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో ఎక్సైజ్‌శాఖ ఉద్యోగులు మరింత అంకితభావంతో పనిచేస్తారని పేర్కొన్నారు.


Next Story

Most Viewed