మాజీ మంత్రి కొప్పన ఇకలేరు!

by  |
మాజీ మంత్రి కొప్పన ఇకలేరు!
X

దిశ, వెబ్ డెస్క్ :
మాజీ మంత్రి, వైసీపీ నేత కొప్పన మోహనరావు (75) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. తూర్పుగోదావరికి చెందిన ఆయన 1978, 1989లో కాంగ్రెస్ తరఫున పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో అటవీ శాఖ మంత్రిగా కూడా పని చేశారు.
ఇటీవల వైసీపీలో చేరి పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఈమధ్య ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు వైసీపీ నేతలు సంతాపం ప్రకటించారు.


Next Story

Most Viewed