ఏ ఒక్క అధికారిని వదలం : దేవినేని

by  |
ఏ ఒక్క అధికారిని వదలం : దేవినేని
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ఫ్రభుత్వం టీడీపీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, దానిలో అధికారులు భాగస్వామ్యం కావొద్దని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధికారులు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, అలాంటి అధికారులు పేర్లు డైరీలో రాసిపెడుతున్నామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టమన్నారు.

విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ వైఫల్యాలపై గళం ఎత్తుతున్న బీసీ నేతలను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్నారు. టీడీపీ నేతలపై బనాయిస్తున్న అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తామని దేవినేని చెప్పారు


Next Story

Most Viewed