- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘సామాజిక న్యాయాన్ని పాటించండి’
by Shamantha N |

X
న్యూఢిల్లీ: సామాజిక న్యాయాన్ని పాటించి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) కింద రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ప్రధాని మోడీని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఈ రిజర్వేషన్లు లేని కారణంగా 2017 నుంచి సుమారు 11వేల సీట్లను ఓబీసీ విద్యార్థులు కోల్పోయారని ఆవేదన చెందారు. ఆల్ ఇండియా కోటా కింద ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 7.5శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు 10శాతం రిజర్వేషన్లున్నాయని గుర్తుచేశారు. సమానత్వం, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓబీసీ విద్యార్థులకు ఆల్ ఇండియా కోటా కింద కేంద్రపాలిత ప్రాంతాలు లేదా రాష్ట్రాల్లోని మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో మెడికల్, డెంటల్ సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
Next Story