భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్

by  |
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. చర్ల, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. సోమవారం ఉదయం మందు పాతర పేల్చిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా చేరుకున్న పోలీస్ బలగాలు ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పడుతున్నాయి. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సైతం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.


Next Story

Most Viewed