చెట్లు నరకడంతో హోటల్ సీజ్

by  |
చెట్లు నరకడంతో హోటల్ సీజ్
X

దిశ, వెబ్ డెస్క్: నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ చిట్యాల మండలంలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ ఓ హోటల్ దగ్గర చెట్లు నరికి ఉండటాన్ని గమనించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. రహదారిపై వెళ్లే వాహనదారులకు హోటల్ కనిపించడం లేదని యజమాని దాదాపు 50 చెట్లను నరికించాడని విచారణలో తెలింది. దీంతో సదురు హోటల్‌ను సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో చిట్యాల సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎన్ గ్రిల్ హోటల్‌ను అధికారులు సీజ్ చేశారు. అలాగే సదరు హోటల్‌పై వాల్టా చట్టం క్రింద కేసు కూడా నమోదు చేశారు.



Next Story

Most Viewed