ఒకటి ఎంఐఎంకు.. మిగతావి టీఆర్ఎస్‌కు

by  |
ఒకటి ఎంఐఎంకు.. మిగతావి టీఆర్ఎస్‌కు
X

దిశ, నిర్మల్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన నిర్మల్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. మొత్తం నిర్మల్ మున్సిపాలిటీ నాలుగు కో ఆప్షన్ పదవులు వచ్చాయి. రెండు మహిళలకు, మరో రెండు జనరల్ కోటా కింద కేటాయించారు. దీంతో ముందుగా ఒప్పదం ప్రకారం ఎంఐఎంకు ఒకటి. మిగతావి ఈఆర్ఎస్ పార్టీకి కేటాయించారు. దీంతో మహిళ కోటా కింద కోటగిరి నాగలక్ష్మి, నదియా మహావన్, జనరల్ కోటా కింద చిలుక గోవర్ధన్, ఎంఐఎం సభ్యులు సయ్యద్ మజార్ లను నిర్మల్ కోప్షన్ మెంబర్స్ గా ఎన్నుకున్నారు. మంత్రి వీరిచే ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం వీరిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్. కౌన్సిలర్లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed