అనుమానస్పదస్థితిలో వృద్ధులు మృతి

by  |
అనుమానస్పదస్థితిలో వృద్ధులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో శుక్రవారం విషాధం చోటుచేసుకుంది. గుంటూరు చానెల్‌లో పడి ఇద్దరు వృద్ధులు అనుమానస్పదంగా మృతి చెందారు. మృతులు తాడిబోయిన శ్రీలక్ష్మి, దొడ్డ కృష్ణమార్తిగా స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మృతదేహాలను వెలికి తీసి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed