- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొని, ఎనిమిది నెలల గర్భిణీ మృతిచెందింది. స్థానిక ఎస్ఐ శివప్రసాద్రెడ్డి వివరాల ప్రకారం.. నల్లవెల్లి గ్రామానికి చెందిన గంగాధర్ తన చెల్లి రజిత (22) 8 నెలల గర్భవతితో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో ఇందల్వాయి నుంచి ద్విచక్రవాహనంపై ధర్పల్లి వెళ్తున్న ఓ యువకుడు ఎదురుగా వచ్చి ఢీ కొట్టడంతో గంగాధర్, తన చెల్లి రజిత ఇద్దరూ కింద పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్ గంగాధర్ కాళ్ళపై నుంచి వెళ్లడంతో గంగాధర్ కాళ్ళు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రజిత మృతిచెందింది. బాధితుడు గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.