- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉద్యమబాటకు దారులేసిన వర్గీక"రణం"

తెలంగాణాలో ఉద్యమాల ద్వారానే ప్రజలు తమ హక్కులను సాధించుకోగలరని మరోసారి రుజువైంది. ఎన్నో ఉద్యమాల తో సాధించుకున్నా ఎస్సీ వర్గీకరణ మరిన్ని ప్రజాస్వామ్య ఉద్యమాలకు తొవ్వ చూపింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ తంతు అధికార కాంగ్రెస్ పార్టీ, దేశంలో ఎన్డీఏ భాగస్వా మ్య పక్షాల కోర్ట్లోకి సమస్యను విసిరింది. ఉప కులాల వారీగా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో తమ న్యాయమైన వాటా ఫలాలు అందుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. "వేయి గొంతులు, లక్షడప్పు లు" చలో హైదరాబాద్ పిలుపు వాయిదా పడింది. ఇది తెలంగాణ ప్రభుత్వానికి కొం డంత ఊరట లభించింది. మాదిగ మేధా వుల ఫోరం కూడా మాలలను తమ అన్న లు అనడం ప్రారంభమైంది. కారంచేడు, చుండూరు ఘటనలో వలె అగ్రవర్ణాల దాడులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని గుర్తు చేసుకున్నది. సమస్య తాత్కాలికంగా ముగిసినట్లు కనిపించినా సెగ మాత్రం చల్లారలేదు.
అయితే వర్గీకరణలో మాదిగలు ఇంకొంత వాటా పెరగాల్సి ఉందని చెబుతుండగా మిగతా ఉపకులాలకు చెందిన బుడగ జంగాలు, నేతకాని వంటివారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం ఒకటి, రెండు, మూడు గ్రూపులలో విభజన సరిగా చేయకపోవడం. ఈ వర్గీకరణతో ఉపాధి, ఉద్యోగ అవకాశాల విషయంలో నష్టం జరుగుతుందని ఆగ్రహంతో ఉన్నారు.
తెలంగాణాకే పరిమితం కాదు కాబట్టి..
తెలంగాణలో వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు, కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి సవాల్ విసిరిందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేసి ఫలాలు అందించిన ఘనత గతంలో చంద్రబాబుకు ఉన్నది. ఇకపోతే పార్లమెంటు ఎన్నికలకు ముందు మందకృష్ణ మాదిగ హైదరాబాదులో భారీ సభ నిర్వహించి ప్రధాని మోడీని ఆహ్వానించి వర్గీకరణపై హామీ పొందారు. మరో అడుగు ముందుకేసి, ఎవరు ఏ పార్టీలో ఉన్న బీజేపీని గెలిపించాలని పిలుపు కూడా ఇచ్చారు. అదే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ మెడకు ఉచ్చులా బిగియనుంది. దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ, దాని భాగస్వామ్య పక్ష పార్టీలు అధికారంలో ఉండడం వలన దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన తప్పని పరిస్థితి బీజేపీకి వచ్చింది. ఇది ఒక రకంగా మందకృష్ణ నాయకత్వానికి కూడా ఇది పెను సవాల్ వంటిదే. తెలంగాణలో వర్గీకరణ జరిగిన కారణంగా తాత్కాలికంగా వాయిదాపడిన "వేయి గొంతులు ఎక్కడ గానం చేయాలి, లక్ష డప్పులు ఎక్కడ మోగించాలి" అన్న విషయం తేల్చడం అంత తేలికైన పని కాదు. తదుపరి కార్యక్రమం వెంటనే అమరావతికి వేదికగా మారుతుం దా? లేకపోతే ఢిల్లీకి చేరనుందా? వర్గీకరణ సమస్య కేవలం తెలంగాణకే పరిమితం కాదు కాబట్టి ఉద్యమాన్ని కొనసాగించి ముందుకు తీసకుపోవడం అనివార్యం కూడా.
సరైన దామాషాలో వాటా దక్కడం లేదని..
ఇదిలా ఉంటే ఎస్టీలలో ఉప కులాల విభజన సమస్య కూడా తీవ్రం కానుంది. అసలు ఎస్టీలు ఎవరు? అనే విషయంలోనే సమస్య ఉంది. గోండ్లు, కొలాములు, కోయలు, చెం చులు తదితరులు మాత్రమే తెలంగాణలో ఎస్టీలని.. లంబాడాలు ఉత్తర భారతదేశం నుండి వచ్చిన అగ్రవర్ణాల వారని చర్చ జరుగుతుంది. 1976 వరకు ఆదివాసులు మాత్రమే ఎస్టీలుగా ఉండేవారు. ఆ తర్వాతే లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చారు. అందుకే ఈవిషయంలో గతంలో కొన్ని ప్రాం తాల్లో వీరి మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. అధికారంలో, అవకాశాలు అందిపుచ్చుకోవడంలో లంబాడాలు ముందు ఉన్నారని ప్రచారం జరగడమే దీనికి ప్రధాన కారణం. అయితే లంబాడాలకున్న బలమైన నాయక త్వం మిగతా తెగలలో కనిపించడం లేదు. అంతమాత్రాన మిగిలిన వారిని తక్కువగా అంచనా వేయలేం. ఇక రాజకీయ రిజర్వేషన్లనల్లో బీసీలు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. తమకు రాజ్యాధికారంలో సరైన దామాషాలో వాటా దక్కడం లేదని చాలా కా లంగా నినదిస్తూనే, నిలదీస్తూనే ఉన్నారు. కాకపోతే బీసీలలో గౌడ, యాదవ, ముది రాజ్, పద్మశాలీ, మున్నూరు కాపు కులస్తులు ఆర్థికంగా, రాజకీయంగా ముందు వరుసలో ఉన్నారు. కానీ మిగిలిన కులాల వారి స్థితి నామ మాత్రమే. అలాగే అగ్రకుల/ వర్ణాలలో ఉన్న వారంతా ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిగా ముందున్నారని చెప్పలేం. క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అంటే పరిస్థితి అందుకు భిన్నంగా లేదని అర్థం.
ఇంకా చేంతాడన్ని సమస్యలు..
సామాజిక, రాజకీయ రంగంలో వెనుకబాటులో, కులంతో బాటు ధనం కూడా కీలక భూమిక పోషిస్తున్నది పోరాటాల, త్యాగాల, ఉద్యమాల ఘన చరిత్ర తెలంగాణకు ఉన్నది. దున్నే వానిదే భూమి ప్రాతిపదికగా సాగిన సాయుధ రైతంగ పోరాటం, భూస్వాముల కబంద హస్తలనుండి లక్షలాది ఎకరాలను పేద రైతాంగం స్వాధీనం చేసుకోవడం అం దరికీ తెలిసిన వాస్తవం. రజాకార్లను గడగడలాడించి, నిజాంకు చెమటలు పట్టించిన ఘనత మహాత్తర తెలంగాణ సాయుధ రైతాం గ పోరాటానిది. ఐదు దశాబ్దాల కాలంలో పలు రూపాలలో నడిచిన ఉద్యమాలతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైం ది. అలుపెరగని ఉద్యమం ద్వారానే వర్గీకరణ సాకారమైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలన్నీ పరిష్కారమవుతావని భావించి పోరాడిన/ త్యాగం చేసిన ప్రజలు ప్రస్తుతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. కారణం నిరు ద్యోగ సమస్య, విద్యారంగ సమస్యలు, అసంఘటిత కార్మికుల సమస్యలు అలానే ఉన్నా యి. సింగరేణి ప్రవేటీకరణ, ఓపెన్ కాస్ట్ గను ల సమస్య పరిష్కారం కాలేదు. భారీ జలవనరుల ప్రాజెక్ట్లు, ఫ్యాక్టరీల ఏర్పాటు కారణం గా ఏర్పడిన నిర్వాసితుల సమస్యలు కొలిక్కి రావడం లేదు. ఆదివాసుల 1/70 చట్టం అమలు, అటవీ హక్కుల చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. పొడుభూముల విషయం తేలడం లేదు. ఇసుక, గ్రానైట్, ల్యాండ్, లిక్క ర్ మాఫియా సమస్యలు తీవ్రంగా వేదిస్తున్నాయి. కౌలు రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర సమస్యలు, ఫార్మా కంపెనీల సమస్యలు, కాలుష్య సమస్యలు, కొత్త ఫ్యాక్టరీల కోసం భూములను ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతు ల సమస్యలు, ఉచిత విద్య, వైద్యం అమలు సమస్యలు, అధ్యాపకుల కొరత సమస్య, మౌలిక వసతుల ఏర్పాటు సమస్య పరిషరించాల్సి ఉన్నది. పౌర, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ ఎండమావిగానే కనబడుతున్నది. ఇలా చెప్పుకుంటూ పోతే చేంతాడన్ని సమస్య లు. వివిధ వర్గాల ప్రజల డిమాండ్లు తెలంగాణలో అపరిష్కృతంగా మిగిలే ఉన్నాయి. పో రాటాల పురిటిగడ్డ తెలంగాణ మారోమారు ప్రజాస్వామిక ఉద్యమాలకు, విముక్తి పోరాటాలకు వేదిక / దివిటీగా మారనున్నదా? ఇదే ఇవాళ ప్రధానంగా రాజకీయ విశ్లేషకులలో జరుగుతున్న ప్రధాన చర్చ.
రమణా చారి
99898 63039