సుశాంత్ కేసులో కీలక పరిణామం

by  |
సుశాంత్ కేసులో కీలక పరిణామం
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఎంటరైంది. ఇటీవల ఈ కేసులో ఆర్థిక లావాదేవీలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. కాగా, సుశాంత్ కేసుపై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. మనీలాండరింగ్ కోణాన్ని తేల్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) దాఖలు చేయాలని ఇప్పటికే తాను ఈడీని కోరినట్టు ఆయన తెలిపారు. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి సహా ఐదుగురిపై ఇప్పటికే బీహార్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.



Next Story