సుశాంత్ కేసులో మరోట్విస్ట్.. ఎంటరైన ఈడీ!

by  |
sushanth
X

దిశ, వెబ్ డెస్క్ :
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఓ వైపు ముంబై, మరోవైపు బీహార్ పోలీసులు విచారణ జరుపుతుండగానే …మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ కేసు నమోదుచేసింది.

ఈ క్రమంలోనే బీహార్ పోలీసులు పలు విషయాలు వెల్లడించారు. కొన్ని నెలలుగా సుశాంత్ చాలా నెంబర్లు మార్చాడని.. అందులో ఒక్క సిమ్ కార్డు కూడా అతని పేరుమీద లేదన్నారు. ఒక్క సిమ్ మాత్రం అతని ఫ్రెండ్ సిద్ధార్థ పేరు మీద ఉందని వివరించారు. అయితే, ఆ కాల్ డేటా ఆధారంగా విచారణ జరిపి అసలు విషయాలు వెల్లడిస్తామని బీహార్ పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed