సీఎం జగన్ ఫోటో నాకు నచ్చలా తీసేయండి : నిమ్మగడ్డ లేఖాస్త్రం

by srinivas |
సీఎం జగన్ ఫోటో నాకు నచ్చలా తీసేయండి : నిమ్మగడ్డ లేఖాస్త్రం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. తొలివిడతలో ఫిబ్రవరి 9న విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3,249 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా ఇవాళ నుంచి అభ్యర్ధులు నామినేషన్లు వేస్తున్నారు. ఈ నామినేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి 4వరకు కొనసాగనుంది. అయితే ఈ ఎన్నికల నామినేషన్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖాస్త్రం సంధించారు. నామినేషన్ పత్రాల్లోని కులధృవీకరణ,ఎన్ఓసీ పత్రాలపై సీఎం జగన్ ఫోటోలను తొలగించాలని ఆదేశించారు. ఈ సమయంలో తహసీల్దార్లు ఇచ్చే పత్రాలపై జగన్ ఫోటో ఉండడం ఎన్నికల నియమావళికి విరుద్దమన్నారు. అందుకే సంబంధిత పత్రాలపై జగన్ ఫోటోలు తొలగించేలా అన్నీ మండలాల్లో ఉన్న తహసీల్దార్లకు ఆదేశాలివ్వాలని నిమ్మగడ్డ సూచించారు.

Next Story

Most Viewed