అందుబాటులోకి కేబుల్ బ్రిడ్జి..!

by  |
అందుబాటులోకి కేబుల్ బ్రిడ్జి..!
X

దిశ, వెబ్‌డెస్క్ :

భాగ్యనగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త తెలిపింది. హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జిని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎంపీ రంజిత్‌రెడ్డిలు హాజరయ్యారు. రూ.184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువుపై ఈ కేబుల్ వంతెనను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టగా, ఎస్సార్‌డీపీ పనుల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ దీని నిర్మాణం చేపట్టింది.

ఇదిలాఉండగా, 21వ శతాబ్దపు ఇంజినీరింగ్‌ అద్భుతంగా అధికారులు వర్ణిస్తున్నారు. 754.38 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జితో మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ల మధ్య దూరం గణనీయంగా తగ్గనుంది. కేబుల్ వంతెన అందుబాటులోకి రావడంతో రోడ్‌ నంబర్‌ 36, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌లో హెవీ ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు ఉపశమనం లభించినట్లు అయింది. అలాగే జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45 ఎలివేటెడ్‌ కారిడార్‌ను కూడా ప్రారంభించారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45ను కలుపుతూ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. దీనికి పెద్దమ్మతల్లి ఎక్స్ ప్రెస్‌వేగా నామకరణం చేశారు.


Next Story

Most Viewed