- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డబుల్ మర్డర్ నిందితుడు ఆత్మహత్య
by Shyam |

X
దిశ, క్రైమ్ బ్యూరో: చాంద్రాయగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ముగ్గురు అక్కలు, బావపై అతి కిరాతకంగా దాడి చేసిన ఘటనలో నిందితుడు ఇస్మాయిల్ బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకేసారి ముగ్గురు అక్కలను, బావను నరికిన ఘటనలో ఇద్దరు అక్కలు అక్కడికక్కడే మరణించారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న దాడిలో అక్కా, బావ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నగరంలో సంచలనంగా మారడంతో నిందితుడు ఇస్మాయిల్ కోసం హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ఏమైందో ఏమో గానీ, బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది ఇస్మాయిల్ తన భార్యను కూడా హత్య చేశాడు
Next Story