రాచకొండ నుంచి రామాలయం వరకూ…

by  |
రాచకొండ నుంచి రామాలయం వరకూ…
X

దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని మహమ్మదాబాద్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ఎంతగానో ఉపయోగపడే రైతు వేదిక నిర్మాణాలను తొందరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాచకొండ గ్రామం నుంచి రామాలయం వరకు ఉన్న మట్టి రోడ్డును పరిశీలించి త్వరలోనే సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed