కార్మికుల‌కు నిత్యావ‌స‌ర సరుకుల పంపిణీ

by Sridhar Babu |
కార్మికుల‌కు నిత్యావ‌స‌ర సరుకుల పంపిణీ
X

దిశ‌, ఖ‌మ్మం: లాక్‎డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న.. వివిధ రంగాల కార్మికులకు ఖమ్మం జిల్లాలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వ‌ర్యంలో 3వేల మంది కార్మికులకు ఆదివారం మంత్రి అజ‌య్‌కుమార్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులను అందజేశారు. అలాగే, కరోనా వైరస్ వ్యాప్తి నివార‌ణ‌కు పారిశుద్ధ్య విధుల‌ను నిర్వ‌హిస్తున్న కార్మికుల‌ను మంత్రి అజ‌య్‌కుమార్ పూల‌మాల‌ల‌తో స‌త్క‌రించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖ‌మ్మం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ రావు పాల్గొన్నారు.

tag: MLA Sandra Venkata Veeraiah, puvvada ajay, Distribution, Essentials commodities, workers, khammam



Next Story