పేదలకు నిత్యావసరాల పంపిణీ

by Sridhar Babu |
పేదలకు నిత్యావసరాల పంపిణీ
X

దిశ, రంగారెడ్డి: జిల్లాలోని మంచాల మండలం జాపాల్ గ్రామంలో తెలంగాణ విశ్వవిద్యాలయాల నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు ఆదివారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంచాల సీఐ అనుదీప్ పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పిలుపు మేరకు లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ను ప్రతిఒక్కరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు.

tags : Distribution, Essential Commodities, Poor people, rangareddy

Next Story