నేటి నుంచి చెక్కుల పంపిణీ.. ఎక్కడంటే..?

by  |
నేటి నుంచి చెక్కుల పంపిణీ.. ఎక్కడంటే..?
X

దిశ, అమరావతి బ్యూరో: కడప జిల్లాలోని కొండాపురం మండల కేంద్రమైన కొండాపురం గ్రామానికి చెందిన పునరావాస పరిహారం చెక్కులను గురువారం నుంచి పంపిణీ చేయనున్నారు. గతంలో ఇచ్చిన 200 చెక్కులకు గాను నిధులు జమ కాని వాటికి తిరిగి చెక్కులను ఇవ్వనున్నట్లు జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న తెలిపారు. వ్యాలిడిటీ చెల్లకపోవడంతో పాత చెక్కులు తీసుకొస్తే రూ.6.75 లక్షలతో తిరిగి కొత్త చెక్కులు ఇస్తామని ఆర్డీవో తెలిపారు. అదేవిధంగా శుక్రవారం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చేతులమీదుగా చెక్కుల ప్రక్రియ ప్రారంభిస్తామని ఆర్డీవో తెలిపారు.


Next Story

Most Viewed