షెల్టర్ హోం నుంచి ఇద్దరు చిన్నారుల అదృశ్యం

by  |
షెల్టర్ హోం నుంచి ఇద్దరు చిన్నారుల అదృశ్యం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో బాలసదనం (షెల్టర్ హోమ్) నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యం అయ్యారు. ఈ మేరకు మంగళవారం బాలసదనం సూపరింటెండెంట్ స్వర్ణలత స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అనిత( 9 ), సయ్యద్ ముస్కన్ తబసుం(9) అనే ఇద్దరు బాలికలు ఇవాళ సాయంత్రం 4:30 గంటల సమయంలో బాలసదన్ నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. ఈ ఇద్దరి గురించి చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో స్వర్ణలత పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Next Story