డీజిల్ రేట్ రూ.8 తగ్గింపు.. ?

by  |
డీజిల్ రేట్ రూ.8 తగ్గింపు.. ?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంధన వనరులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏకంగా డీజిల్ ధర రూ. 8 వరకు తగ్గనుంది. దీనిపై కేంద్ర మంత్రి వర్గం కూడా ఆమోదం తెలపడంతో రేపటి నుంచే తగ్గించిన ధరలు అమలులోకి రానున్నాయి.

కరోనా ప్రభావంతో దేశంలో పెట్రోల్‌తో పాటు.. డీజిల్ ధరలు అమాంతం పెరిగాయి. ఈ నేపథ్యంలో రోజు రోజుకీ పెట్రోల్‌-డిజీల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. అటు ఢిల్లీలో ప్రస్తుతం డీజిల్ ధర 81.94 ఉండగా.. తాజా ధరలతో 73.94కు దిగిరానుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం శుభవార్త ఇచ్చిందని డీజిల్ వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు


Next Story

Most Viewed