Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

by D.Reddy |
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: కలియుగ దైవం ఏడుకొండల స్వామి నిలయమైన తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం స్వామివారిని 65,201 మంది భక్తులు (Devotees) దర్శించుకున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.93 కోట్లు సమకూరినట్లు వెల్లడించింది.

కాగా, ఏప్రిల్ 10 నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులు ఆర్జిత సేవలు రద్దు చేస్తునట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఓ ప్రకటనలో తెలిపింది.



Next Story

Most Viewed