తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

by D.Reddy |
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని 59,776 మంది భక్తులు దర్శించుకోగా, 22,386 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.24 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

Advertisement
Next Story