జగన్ గారూ.. అది వినబడుతోందా?: దేవినేని

by  |
జగన్ గారూ.. అది వినబడుతోందా?: దేవినేని
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.. వైద్యం అందక.. భోజన వసతులు లేక రోడ్డెక్కుతున్న కరోనా బాధితుల ఆవేదన వినబడుతోందా? అని ట్విట్టర్ మాధ్యమంగా టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నిస్తూ, ‘‘కేసులు2,27,860కి చేరుకోగా, మరణాలు 2వేలు దాటాయి. యాక్టివ్ కేసుల్లో రెండోస్థానం. దేశ సగటు కంటే రాష్ట్రంలో మూడురెట్ల కేసులు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్న నిపుణులు. వారం రోజులుగా విజృంభణ. వైద్యం అందక, భోజన వసతులు లేక రోడ్డు ఎక్కుతున్న కోవిడ్ బాధితుల ఆవేదన మీకు వినబడుతుందా జగన్ గారూ’’ అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు.


Next Story

Most Viewed