నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

by  |
నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
X

దిశ, నాగార్జున‌సాగర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబంధిత అధికారులను హెచ్చరించారు. శుక్రవారం పెద్దవూర మండలంలోని పోతునూరు, పెద్దవూర, పర్వేదుల, జయరాంతండాల్లో పర్యటంచిన కలెక్టర్ పల్లె ప్రగతివనాలను ప్రారంభించారు.

పంచాయతీల్లో నిర్మిస్తున్న డంపింగ్ యార్డులు, సేంద్రీయ ఎరువులు తయారీ చేసే షెడ్లు, శ్మశాన వాటికలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలను వెంటనే పూర్తి చేసి, పల్లె సీమల అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలపై అలసత్వం వహించకూడదన్నారు. నివాస పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంపొందించాలని అన్నారు.


Next Story

Most Viewed