‘కమ్మ, రెడ్డిలను చీల్చింది చంద్రబాబే’

by  |
‘కమ్మ, రెడ్డిలను చీల్చింది చంద్రబాబే’
X

దిశ, అమరావతి: చదువుకునే రోజుల్లోనే చంద్రబాబు ఎస్వీ యూనివర్సిటీలో కమ్మ, రెడ్డి కులాలను చీల్చారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు. అటువంటి వ్యక్తి నేడు కులాల గురించి గగ్గోలు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. శుక్రవారం జగన్ మోహన్ రెడ్డి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ప్రవేశ పెట్టిన అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెట్టారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి కులాలకు అతీతంగా పని చేస్తున్నారని.. అలాంటి వ్యక్తిపై నిందలు వేయడం సరికాదని నారాయనస్వామి చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed