నాలాల అక్రమ నిర్మాణాలను కూల్చేయండి..!

by  |
నాలాల అక్రమ నిర్మాణాలను కూల్చేయండి..!
X

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్ : మహబూబ్‎నగర్ జిల్లా కేంద్రంలోని రామయ్య బౌలి, బీకే రెడ్డి కాలనీ, ఎంబీసీ కాంపెక్ల్స్, బృందావన్ కాలనీల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. జల దిగ్బంధనంలో చిక్కుకున్న ప్రాంతాలను పర్యటించిన ఆయన.. సహాయక చర్యలకు ఉపక్రమించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ ప్రభావమో, సీఎం కేసీఆర్ యజ్ఞ ఫలితమో ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయని అన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులు నిండిపోయాయని అన్నారు. గతంలో చెరువుల నాళాలను ఆక్రమించి వాటిపై నిర్మాణాలు చేయడం వల్లే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని తెలిపారు. నాళాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ఆధికారులను ఆదేశించారు.


Next Story

Most Viewed