క్షీణించిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఆరోగ్యం

by  |
క్షీణించిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఆరోగ్యం
X

దిశ,వెబ్‌డెస్క్: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోగ్యం విషమించింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. కోవిడ్, డెంగ్యూతో బాధపడుతూ ఆస్పత్రిపాలైన డిప్యూటీ సీఎం ఢిల్లీలోని ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్లేట్‌లెట్లు పడిపోవడం, ఆక్సీజన్ శాతం పడిపోవడంతో ఆయన్ను సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు సిసోడియా ఆరోగ్య పరిస్థిని సమీక్షిస్తున్నారు.


Next Story

Most Viewed