కెనాల్ లోకి దూసుకెళ్లిన డీసీఎం..!

by  |
కెనాల్ లోకి దూసుకెళ్లిన డీసీఎం..!
X

దిశ, వెబ్‎‎డెస్క్: నల్గొండ జిల్లాలో అదుపు తప్పి ఓ వాహనం కెనాల్‎లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన వేములపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా నడికుడి నుంచి నల్గొండకు మిర్చి లోడ్‎తో డీసీఎం బయలుదేరింది. వేములపల్లి వద్ద అదుపు తప్పి సాగర్ కెనాల్ లోకి దూసుకుపోయింది. డీసీఎంను గమనించిన స్థానికులు డ్రైవర్ ను కాపాడారు. కాగా, నీటి ఉధృతికి మిర్చి బస్తాలు కొట్టుకుపోయాయి.



Next Story