అంతర్వేదిలో దర్శనాలు ప్రారంభం

by  |
అంతర్వేదిలో దర్శనాలు ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాలను సోమవారం నుంచి పునరుద్ధరించనున్నారు. ఆలయ ప్రాంగణంలో, దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసుల కారణంగా 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆలయంలో దర్శనాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు పునఃసమీక్షించి దర్శనాలు తిరిగి ప్రారంభించామని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్‌ భద్రాజీ మాట్లాడుతూ… స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ, శానిటైజర్‌ వాడుతూ క్యూలైన్‌లో రావాలన్నారు. ఐదేండ్లలోపు పిల్లలకు, వృద్ధులకు ఆలయంలో ప్రవేశం లేదని తెలిపారు.


Next Story

Most Viewed