కాసేపట్లో విచారణకు సీఎస్ సోమేష్‌కుమార్..

by  |
కాసేపట్లో విచారణకు సీఎస్ సోమేష్‌కుమార్..
X

దిశ, వెబ్‌ డెస్క్:
తెలంగాణలో కరోనా పరిస్థితులపై కాసేపట్లో హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో విచారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ హాజరుకానున్నారు. గత విచారణలో భాగంగా ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాటి అమలుకు సంబంధించి అంశాలపై నేడు సీఎస్ కోర్టుకు హాజరై వివరణ ఇవ్వనున్నారు.

కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రభుత్వం టెస్టులు చేయడంలేదని, తప్పుడు రిపోర్టులు వెల్లడిస్తోందని గతంలో హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారణకు స్వీకరించిన కోర్టు ప్రభుత్వానికి పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. అయినా ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న న్యాయస్థానం రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టు విచారణకు హాజరుకావాల్సిందని ఆదేశించిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed