ఈతకు వెళ్లిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి.. చెరువులో గల్లంతు

by Aamani |
ఈతకు వెళ్లిన ఆర్టీసీ రిటైర్డ్  ఉద్యోగి.. చెరువులో గల్లంతు
X

దిశ కొల్చారం: గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరిగుంతం పెద్ద చెరువు అలుగు పారుతుంది. పండగ పూట చెరువులో ఈత కొట్టి స్నానం చేద్దామనుకొని ఈతకు వెళ్లిన వరిగుంతం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ కురుమ శాఖయ్య (62) చెరువులో గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్ల సాయంతో గ్రామస్తులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను పరిశీలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed