నిన్న అన్న..నేడు తమ్ముడు..

by Sridhar Babu |
నిన్న అన్న..నేడు తమ్ముడు..
X

దిశ,పెగడపల్లి : అతి వేగంతో ముగ్గురిని కారు ఢీ కొట్టిన ఘటనలో నిన్న అన్న నేడు తమ్ముడు మృతి చెందిన సంఘటన తీవ్ర విషాదం నింపింది. ఎస్సై రవి కిరణ్ తెలి పిన వివరాల ప్రకారం మండలంలోని బతికేపల్లి గ్రామంలో సోమవారం పంగ రాజయ్య అనే వ్యక్తి అతి వేగంతో ముగ్గురిని కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన సయ్యద్ సర్వర్ కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందగా సయ్యద్ జకీర్ అదే రోజు అర్ధరాత్రి మరణించాడు. సొంత అన్నదమ్ములైన సర్వర్ పాషా, జకీర్ ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story