Thunder : పిడుగు పాటుతో ఇద్దరు మృతి

by Sridhar Babu |
Thunder : పిడుగు పాటుతో ఇద్దరు మృతి
X

దిశ, టేక్మాల్ : పిడుగు (Thunder)పాటుతో ఇద్దరు మృతి చెందిన ఘటన టేక్మాల్ మండల పరిధిలోని దన్నారం గ్రామ శివారులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బండారి బేతయ్య (45), డాకూరి భరత్(17) (Bandari Bethiah,Dakuri Bharat) (17))ప్రతిరోజు లాగే గొర్రెలు, మేకలను మేపడానికి వెళ్లారు, సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో చెట్టు కిందికి వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఒక చెట్టు కింద శవాలుగా పడి ఉన్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



Next Story

Most Viewed