గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్ట్​

by Sridhar Babu |
గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్ట్​
X

దిశ, మందమర్రి : గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్​ చేశారు. పట్టణ సీఐ శశిధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మంగళవారం ఉదయం ఎస్సై రాజశేఖర్, అదనపు ఎస్సై శ్రీనివాస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు యువకులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులు వరుణ్, గంగాధర్, మధుసూదన్ లపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గంగాధర్ పై గతంలో మూడు కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై రాజశేఖర్, అదనపు ఎస్సై శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ రాము, మల్లేష్, శ్రీనివాస్ ఉన్నారు.

Advertisement

Next Story