దొంగల బీభత్సం..పట్టుకుని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు

by Aamani |
దొంగల బీభత్సం..పట్టుకుని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు
X

దిశ,భైంసా : తానూరు మండలంలోని మహలింగి గ్రామంలో మధ్యాహ్నం తాళం వేసిన ఇంట్లోకి నలుగురు దుండగులు చొరబడి బీభత్సం సృష్టించారు.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామంలో ఇద్దరు వ్యక్తులు కాలం చేయగా,గ్రామస్తులు అంత్యక్రియలకు హాజరయ్యారు.ఇదే క్రమంలో ఎవరూ లేరని గమనించిన ఇద్దరు మహిళలు,ఇద్దరు పురుషులు డబ్బాలు అమ్ముతామంటూ తిరుగుతూ...గ్రామానికి చెందిన ఫిరాజి అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి ఉండడం గమనించి,ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. గమనించిన గ్రామస్తులు అదుపులోకి తీసుకొని ఆ నలుగురినీ విచారించగా మహారాష్ట్ర నుంచి వచ్చామని పేర్కొనగా,దుండగుల చేతులను తాళ్లతో కట్టేసి, పోలీసులకు సమాచారం అందించి, అప్పగించారు.పోలీసుల విచారణలో ఏ ఏ ఇంట్లో చోరీకి పాల్పడ్డారో పూర్తి వివరాలు తెలుస్తుందని గ్రామస్తులు భావిస్తున్నారు.

Advertisement

Next Story