ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి చెరువులో శవమై తేలాడు..

by Sumithra |
ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి చెరువులో శవమై తేలాడు..
X

దిశ, నిజాంపేట : కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి చెరువులో శవమై తేలిన సంఘటన నిజాంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన దేవరాజు (32) గత సంవత్సర కాలం నుండి కుటుంబ సమస్యలతో బాధపడుతూ 25/09/24 రోజున రాత్రి 9 గంటల సమయంలో తన ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిపోయాడు.

వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతకగా ఆచూకీ లభించలేదు. శనివారం రోజు రాత్రి గ్రామ శివారులోని ఏనుకుంట చెరువులో గుర్తుతెలియని మృతదేహం తేలిందని గ్రామస్తుల ద్వారా తెలిసింది. చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా మరణించిన వ్యక్తి దేవరాజ్ అని గుర్తించారని తెలిపారు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed