- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
16.43 కేజీల గంజాయి పట్టివేత
దిశ,మణుగూరు : 16.43 కేజీల గంజాయిని తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మండలంలోని రథంగుట్ట అర్బన్ పార్క్ ఎదురుగా పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని విచారించగా ఒరిస్సాలోని మల్కాజ్గిరి నుంచి టేకులపల్లి, జగిత్యాల, సూర్యాపేటకు 16.43 కేజీల గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు.
దాంతో వారిని అదుపులో తీసుకొని గంజాయితో పాటు మూడు బైక్లను సీజ్ చేశారు. వీరిలో కమల అరవింద్, మారంపల్లి లక్ష్మణ్ జగిత్యాలకు చెందిన వారు కాగా, బొమ్మ కంటి గోపి, పర్సబోయిన రమేష్ సూర్యాపేటకి చెందినవారని, బుక్య సాయికుమార్, గుగులోతు నవీన్ కుమార్ టేకులపల్లి వాసులు. ఈ కేసును మణుగూరు ఎక్సైజ్ శాఖ సీఐ రాజి రెడ్డికి అప్పగించామని, ఈ కేసుపై పూర్తి విచారణ చేయాలని ఆదేశించామని తిరుపతి తెలిపారు. ఈ తనిఖీలో డీసీ జనార్దన్ రెడ్డి, ఏసీ గణేష్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ సీహెచ్. శ్రీనివాస్, సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ కరీం, బాలు, కానిస్టేబుళ్లు సుధీర్, వెంకట్, విజయ్, హనుమంతరావు పాల్గొన్నారు.
- Tags
- ganja Seiz