Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, విద్యార్థులకు తీవ్ర గాయాలు

by Shiva |
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, విద్యార్థులకు తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్/నర్సాపూర్: నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలకు చెందిన రెండు బస్సులు ఢీకొని ఒకరు మృతి చెందగా.. 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలైన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. సంగారెడ్డి ప్రాంతం నుంచి వచ్చిన బస్సు కళాశాలలో విద్యార్థులను డ్రాప్ చేసి నర్సాపూర్ లోకల్ విద్యార్థులను తీసుకొచ్చేందుకు బయలుదేరింది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కళాశాలకు వస్తున్న మరో బస్సు నర్సాపూర్ సమీపంలోని ఆనంద్ గార్డెన్ సమీపంలోకి రాగానే ఓ వాహనం తప్పించబోయి రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా మరో డ్రైవర్‌తో పాటు సుమారు 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు వారందరినీ చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి‌తో పాటు ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో క్రేన్, జేసీబీలను ఏర్పాటు చేసి రోడ్డుపై ఉన్న బస్సులను పక్కకు తీయించారు. కాగా మృతి చెందిన డ్రైవర్ నాగరాజు పటాన్‌చెరు వాసిగా గుర్తించారు. తీవ్ర గాయాల పాలైన మరో డ్రైవర్ యాదగిరిని సంగారెడ్డి వాసిగా పోలీసులు గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed