నకిలీ ట్రాన్సజెండర్‌ల ముఠా అరెస్ట్

by Aamani |
నకిలీ ట్రాన్సజెండర్‌ల ముఠా అరెస్ట్
X

దిశ, సిటీ క్రైమ్ : నకిలీ ట్రాన్సజెండర్ ల ముఠా ను శుక్రవారం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పురుషుడు నుంచి ట్రాన్సజెండర్ లు గా మారిన వారు ఈ ముఠా ను తయారు చేసి దుకాణాలు, ట్రాఫిక్ జంక్షన్ ల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారని పోలీస్ దర్యాప్తులో తేలింది. టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం.... ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం, హిందూపూర్, అనంతపురం ప్రాంతాలకు చెందిన ఎస్. కుమార్ అలియాస్ సూరదా చాందిని, రమేష్ @ జయశ్రీ, మల్లేష్ @మనీషా లు ట్రాన్సజెండర్ లు గా మారారు. వీరంతా హైదరాబాద్ యాప్రాల్ బాలాజీ నగర్ లో నివాసం ఉంటున్నారు.

వీరు సురేష్, బాషా, ఫకృద్దీన్, అల్తాఫ్ ల తో ముఠా ను ఏర్పాటు చేసుకుని వారికి చీరలు, లేడీస్ డ్రెస్ లను వేయించి వారిని మహిళ ట్రాన్సజెండర్ లుగా చలామణి చేయించి ట్రాఫిక్ జంక్షన్ లు, దుకాణాలు ఇతర శుభాకార్యాల వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. గ్రీన్ సిగ్నల్ పడగానే రోడ్లపై నిలిచిపోయిన వాహనదారులను వీరి వెకిలి చేష్టలతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. ఈ ఫిర్యాదుల పై దర్యాప్తు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాయాబజార్ హోటల్ వద్ద వీరు హంగామా చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కోసం వీరిని కార్ఖానా పోలీసులకు అప్పగించారు. ఈ తరహా లో ఎవరైనా బలవంతంగా డబ్బులు డిమాండ్ చేస్తే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని డీసీపీ సుధీంద్ర ప్రజలను కోరారు.

Advertisement

Next Story

Most Viewed