ప్రాణం తీసిన కుటుంబ గొడవలు

by Sridhar Babu |
ప్రాణం తీసిన కుటుంబ గొడవలు
X

దిశ, ఎల్లారెడ్దిపేట : ఓ హమాలీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఎల్లారెడ్డిపేట మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కోనేటి మల్లయ్య (52 ) శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా ఇంట్లో భార్యతో గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో భార్య అంజవ్వతో గొడవ పడగా కొడిమ్యాల మండలం చెప్యాలలో గల తల్లిగారింటికి వెళ్లిపోయింది. దాంతో మృతుడు జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో శుక్రవారం దూలానికి ఉరి వేసుకున్నాడు. శనివారం దుర్వాసన వెదజల్లడంతో పక్కనున్న వాళ్లు తలుపులు తెరిచి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి కొడుకు రాజకుమార్, కూతురు శైలజ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed