- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా...ఇద్దరు రైతులు మృతి
దిశ, జడ్చర్ల : వ్యవసాయ పొలాల వద్ద ట్రాన్స్ఫార్మర్ నిర్మించేందుకు కావాల్సిన విద్యుత్ స్తంభాలను ట్రాక్టర్ పై తీసుకువెళ్తుండగా ట్రాలీ బోల్తాపడి ఇద్దరు రైతులు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జడ్చర్ల మండలం గంగాపూర్ శివార్లో గల 167 వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. జడ్చర్ల మండల పరిధిలోని చిన్నాదిరాల గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ వ్యవసాయ పొలాల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నిర్మించేందుకు విద్యుత్ శాఖ అధికారులకు డీడీలు చెల్లించారు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభాలను తీసుకెళ్లడానికి ట్రాక్టర్ తీసుకురావాలని విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్ సూచించారు. దీంతో వారు గ్రామానికి చెందిన ట్రాక్టర్ తీసుకొని విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లి ట్రాక్టర్లో 11 స్తంభాలను ఎక్కించి గ్రామానికి బయలుదేరారు.
ఈ సమయంలో ట్రాక్టర్ చిన్నదిరాల గ్రామానికి చెందిన రైతులు పబ్బతి జంగయ్య (60), ఎద్దుల జంగయ్య (54) ట్రాక్టర్ ట్రాలీలో కూర్చున్నారు. ఈ క్రమంలో గంగాపూర్ శివారులోకి చేరుకోగానే అదుపుతప్పి ట్రాక్టర్ ట్రాలీ కింద పడింది. ఈ క్రమంలో స్తంభాలు రైతులపై పడడంతో పబ్బంతి జంగయ్య అక్కడికక్కడే మృతి చెందగా, జంగయ్యకు తీవ్రగాయాలై ఆస్పత్రిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జంగయ్య మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. నిజానికి విద్యుత్ అధికారులే స్తంభాలను రైతుల పొలాల వద్దకు చేర్చాలని అన్నదాతలు పేర్కొంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఇద్దరు రైతులు బలి కావడం బాధాకరమని, వారి మృతికి విద్యుత్ శాఖ అధికారులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన జంగయ్య మృతదేహాన్ని జడ్చర్ల మార్చురీలో పరిశీలించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, ఆఫీస్, కొంగలి నాగరాజు, మచ్చల శ్రీను, కరాటే శ్రీను, చిన్నదిరాళ్ల మాజీ సర్పంచ్ రవి తదితరులు ఉన్నారు.
- Tags
- Two farmers died