BREAKING: చెన్నై పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు.. రూ.110 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

by Shiva |
BREAKING: చెన్నై పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు.. రూ.110 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా డ్రగ్స్ (Drugs) వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని సూచించింది. దీంతో దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు (Airports), ఓడరేవు (Port)లను కస్టమ్స్ అధికారులు (Customs officials) జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీలు, కంటైనర్లను క్లియర్ చెక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున చెన్నై పోర్టు (Chennai Port)లో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఓ ముఠా కంటైనర్‌లో అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న రూ.110 కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్‌ను వారు గుర్తించారు. అయితే, చెన్నై పోర్టు నుంచి ఆస్ట్రేలియా (Australia)కు డ్రగ్స్ తరలిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణ వెల్లడైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Advertisement

Next Story

Most Viewed