ఎలుకల మందు తాగి మహిళ ఆత్మహత్య.. కారణం అదే..

by Sumithra |
ఎలుకల మందు తాగి మహిళ ఆత్మహత్య.. కారణం అదే..
X

దిశ, తాడ్వాయి : ఎలుకల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాడ్వాయి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ ఫాతిమా బేగం (45) ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ విషయం గ్రహించిన ఆమె కుమారుడు హుటాహుటిన ఆటోలో జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ లోని ఓ అస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మహిళ గురువారం మృతి చెందిందని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. మృతురాలికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.

Advertisement

Next Story