- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
by Sumithra |
X
దిశ, మునిపల్లి : ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొని మృతి చెందిన సంఘటన మునిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మునిపల్లి ఏఎస్ఐ ఏసయ్య కథనం ప్రకారం బుదేరా గ్రామానికి చెందిన జోగిపేట ఈశ్వరయ్య గౌడ్ (65) కళ్ళు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం 7 గంటలకు కళ్ళు సీసాలు తీసుకొని ఎన్ఎచ్ 65 హైవే దాటుతున్నాడు.
అదే సమయానికి సదాశివపేట వైపు నుంచి జహీరాబాద్ వైపు వెలుతున్న రాయల్ ఎంఫీల్డ్ ఢీ కొట్టడంతో ఈశ్వరయ్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయనను కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ లో సంగారెడ్డిలోని గోకుల్ ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్ఐ యేసయ్య తెలిపారు. ఈశ్వరయ్య గౌడ్ భార్య జోగిపేట సంగమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story