రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

by Sumithra |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
X

దిశ, మునిపల్లి : ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొని మృతి చెందిన సంఘటన మునిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మునిపల్లి ఏఎస్ఐ ఏసయ్య కథనం ప్రకారం బుదేరా గ్రామానికి చెందిన జోగిపేట ఈశ్వరయ్య గౌడ్ (65) కళ్ళు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం 7 గంటలకు కళ్ళు సీసాలు తీసుకొని ఎన్ఎచ్ 65 హైవే దాటుతున్నాడు.

అదే సమయానికి సదాశివపేట వైపు నుంచి జహీరాబాద్ వైపు వెలుతున్న రాయల్ ఎంఫీల్డ్ ఢీ కొట్టడంతో ఈశ్వరయ్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయనను కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ లో సంగారెడ్డిలోని గోకుల్ ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్ఐ యేసయ్య తెలిపారు. ఈశ్వరయ్య గౌడ్ భార్య జోగిపేట సంగమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed