రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య..

by Sumithra |
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ, రామకృష్ణాపూర్ : ఆర్థిక ఇబ్బందులు తాళ లేక ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ‌మంచిర్యాల ఆర్పీఎఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారి కేంసారం సంపత్ తెలిపారు. వివరాల్లోకివెళితే రామకృష్ణాపూర్ భగత్ సింగ్ నగర్ కు చెందిన గాదే తిరుపతి (46)అనే వ్యక్తి మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులతో తీవ్రమనస్థాపానికి గురై జీవితం పై విరక్తి చెంది బుధవారం రవీంద్రఖని రైల్వే స్టేషన్ మొదటి ఫ్లాట్ ఫామ్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed